Rahul Gandhi: అయిదు కాదు పది కాదు ఏకంగా 250 కి.మీ ల మేర కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లారీలో ప్రయాణం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ నుండి చండీగడ్ వరకు సోమవారం రాత్రి అంతా కూడా ఆయన లారీలో ప్రయాణం చేయడం జరిగింది. లారీ క్యాబిన్ లో డ్రైవర్ మరియు క్లీన్ తో కలిసి ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ లారీ డ్రైవర్ ల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మధ్య మధ్యలో దాబాల వద్ద ఆగినప్పుడు అక్కడ ఉన్న ఇతర లారీ డ్రైవర్ల యొక్క సాదక బాదకాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ లారీ ప్రయాణంకు సంబంధించిన విషయాన్ని మొదట రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ అధికారికంగా ఫోటోలు షేర్ చేయడం జరిగింది.
ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ప్రజల్లోకి దూసుకు వెళ్తున్న విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర అంటూ పాద యాత్ర చేసి అందరిని సర్ ప్రైజ్ చేసిన రాహుల్ గాంధీ ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాలకు చేరువ అవుతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఈ ఎండ కాలంలో లారీ ప్రయాణం అంటే చాలా కష్టం. వేడిని తట్టుకోవడం అంత సులభం కాదు. అయినా కూడా లారీ లో 250 కి.మీ లు ప్రయాణం చేశారు అంటే రాహుల్ గాంధీ యొక్క పట్టుదల మరియు ఆయన యొక్క ధైర్యంకు నిదర్శణం అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే ప్రధాని అంటూ రాహుల్ గాంధీ గురించి ఆ పార్టీ నాయకులు ఈ విషయమై చర్చించుకుంటున్నారు.