అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య ఉండే అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు తెలుగు యువకుడు సాయి వర్షన్ కందుల ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది. 19 ఏళ్ల సాయి వర్షన్ ఒక భారీ ట్రక్ తో శ్వేత సౌధం ఉత్తర భాగం వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే ఆ భారీ ట్రక్ ను అడ్డుకున్నారు. పోలీసులు ట్రక్ నుండి యువకుడిని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు ఈ దాడి చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయమై ఎంక్వౌరీ జరుగుతోంది.
ఛెస్ట్ ఫీల్డ్ కి చెందిన సాయి వర్ధన్ ఇటీవల మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. సాయి వర్ధన్ తీసుకు వచ్చిన భారీ ట్రక్ పై నాజీ జెండా ఉందని పోలీసులు పేర్కొన్నారు. సాయి వర్ధన్ పై పలు అభియోగాలు నమోదు చేసి కేసు ఫైల్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అతడి మానసిక స్థితి గురించి కూడా చర్చ జరుగుతోంది.