Raghuramakrishna Raju: సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghuramakrishna Raju) పోటీ చేసే విషయంపై సందిగ్ధత వీడలేదు. అయితే.. తాను మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని అంటున్నారు. అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తా. ఏ పార్టీ.. ఎక్కడి నుంచి అని తెలియదు. ఎంపీ, ఎమ్మెల్యేగానో కూడా తెలీదు. కానీ.. తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తా. ఆ నమ్మకం నాకుంది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఇందుకు సంబంధించిన వార్త వస్తుందనే ఆశిస్తున్నా’నని అన్నారు.
వైసీపీ రెబల్ ఎంపీగా రఘురామకృష్ణ రాజు కొన్నేళ్లుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఢిల్లీ నుంచే వైసీపీపై తీవ్ర విమర్శలు చేసారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి తప్పకుండా టికెట్ వస్తుందని భావించిన ఆయన పార్టీ విడుదల చేసిన జాబితాల్లో పేరు లేకపోవడం నిరాశపరచింది. ఈక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈనేపథ్యంలో ఆయనకు బీజేపీ లేదా టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.