సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’ . ఓ మంచి పాయింట్ తో కంప్లీట్ ఎంటర్టైనర్స్ తీసే మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. నేడు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర మొదటి టీజర్ ని రిలీజ్ చేశారు.
ఇప్పుడు టీజర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే.. టీజర్ లో డైలాగ్స్ ఏమీ లేవు కానీ కుటుంబంలో జరిగే అందమైన అనుభవాల సమూహారంగా టీజర్ ని కట్ చేశారు. అలాగే ప్రతి ఫ్రేమ్ లోనూ కుటుంబ విలువలను, అందరూ కలిసుంటే కలిగే ఎంత ఆనందం ఉంటుంది అనేది చూపించారు. ముఖ్యంగా ఒక తండ్రి ప్రతి రోజూ పండగే అనేదానికి ఉదాహరణగా నిలిస్తే అతని కొడుకు మరియు ఫామిలీ ఎంత హాయిగా ఉంటుందనేది చెప్పకనే చెప్పాడు. సూపర్బ్ విజువల్స్ ని హైలైట్ చేసేలా థమన్ వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ‘ప్రతి రోజూ పండుగ’లో తండ్రి – కొడుకుల ఎమోషన్ హైలైట్ గా నిలవనుందని సమాచారం.
యువు క్రియేషన్స్ – జిఏ2 పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
620756 209491I truly appreciated this gorgeous weblog. Make positive you maintain up the great function. Best Regards . 813946