ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా సాగుతోంది. శుక్రవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం గాజువార నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్.. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తన రెండో నామినేషన్ను దాఖలు చేశారు. ‘తనను భీమవరం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఏం చేశారో మాత్రం తెలియదు. నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి. నాకు అవకాశం ఇస్తే భీమవరంని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా. విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాను. నా కోసం కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నా. నేను మీ సేవకుడిని. నేను మీ భుజాల మీద ఎక్కి నడిచే నాయకుడిని కాదు’ అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
మరో పక్క తెదేపా యువ నేత నారా లోకేశ్ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు తల్లిదండ్రులు భువనేశ్వరి-చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు లోకేశ్. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందని, నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదిస్తే మంగళగిరిని దేశంంలోనే నెంబర్ వన్గా నిలబెడతానని హామీ ఇచ్చారు.. రాబోయే రోజుల్లో మంగళగిరి ఐటీ హబ్గా మారుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా భారీ మెజార్టీతో గెలుపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అటు కడప జిల్లా పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నాం 1.49 గంటలకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. జగన్ వెంట కుటుంబసభ్యులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. అంతకుముందు స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించారు.
19985 155754Deference to op , some superb selective information . 306008
956815 76849Is gonna be back often in order to inspect new posts 728749