Pawan Kalyan: ‘నలభై సీట్లైనా గెలిచి వుంటే, ముఖ్యమంత్రి పదవి గురించి గట్టిగా వాళ్ళ దగ్గర అడిగేందుకు అవకాశం వుండేది.. అలా కానప్పుడు, వాళ్ళెందుకు మనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న, జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి చేసిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనవసర రచ్చ చాలానే జరిగింది.. అదింకా జరుగుతూనే వుంది.!
రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం నేపథ్యంలో జనసేన శ్రేణులకు జనసేనాని స్పష్టమైన సంకేతమిచ్చారు. ‘మనం మోసం చేయలేం. మనం రియాల్టీ మాత్రమే మాట్లాడుకుని.. పార్టీని బలోపేతం చేసుకుందాం..’ అన్నది జనసేనాని ఉద్దేశ్యం. అదే ఆయన చెప్పారు కూడా.!
ఇక, జనసేనాని ఇచ్చిన మరో స్పష్టత.. ‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..’ అని. అంతే తప్ప, ‘టీడీపీ గెలుపుకి సహకరిస్తాం..’ అని పవన్ కళ్యాణ్ అనలేదు. ‘బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిద్దాం..’ అని కూడా చెప్పలేదు. ‘వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తాం. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం..’ అన్నారంటే, అదెంత బలమైన మాట.. అనేది అర్థమవుతోంది.
‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..’ అని జనసేనాని చెప్పడం వెనుక, ‘ఆ ప్రభుత్వంలో మేముంటాం..’ అనే కదా.! ఏం, ‘ఆ ప్రభుత్వానికి మేమే నాయకత్వం వహిస్తాం’ అని జనసేనాని చెప్పారని ఎందుకు అర్థం చేసుకోకూడదు.?
2024 ఎన్నికలకు సంబంధించి కింది స్థాయిలో జనసైనికులు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలనీ, రాజకీయంగా పొత్తులకు ఆస్కారం వుంది గనుక, అనవసర వివాదాల జోలికి వెళ్ళొద్దనీ జనసేనాని, పార్టీ శ్రేణులకు ఈ విధంగా సూచించినట్లయ్యింది.