సినీ పరిశ్రమలో ఆర్ధిక లావాదేవీలు ఒక్కోసారి సమస్యలు తెచ్చిపెడుతూంటాయి. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాను నిర్మిస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. దీంతో ఆయనకు ప్రత్తిపాడులోని మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2016లో నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా హక్కుల విషయంలో ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి 50 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. సినిమా హక్కులను అతనికి కాకుండా మరో డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చారనేది వాదన. దీనిపై కోర్టులో కేసు వేసాడు ఆ యూఎస్ డిస్ట్రిబ్యూటర్. తీసుకున్న అడ్వాన్సు ఇవ్వకపోగా 10లక్షలు మాత్రమే ఇస్తానంటూ రవీందర్ రెడ్డి అంటున్నాడని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకు విన్నవించాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణ చివరి దశలో ఉంది. అయితే.. విచారణకు రవీందర్ రెడ్డి హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినట్టు తెలుస్తోంది. కేసును ఏప్రిల్ 19కి వాయిదా వేస్తూ.. అప్పుడు రవీందర్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
241661 24241I undoubtedly did not realize that. Learnt something new nowadays! Thanks for that. 406183
534027 598544Pretty section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get really enjoyed account your weblog posts. Any way I will likely be subscribing to your augment and even I achievement you access consistently speedily. 889509
647883 736407Once I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with exactly the same comment. Is there any means you possibly can remove me from that service? Thanks! 818332