ఇచ్చిన డబ్బు అడిగినందుకు ఉపాధ్యాయుడిని హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. స్థానికంగా నివాసముండే నరహరి చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన జగదీశ్ పదేళ్లుగా స్థానికంగా నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. జగదీశ్ కు నరహరి 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ అప్పుగా ఇచ్చాడు.
రెండు నెలలుగా డబ్బు ఇవ్వాలంటూ జగదీశ్ పై నరహరి ఒత్తిడి తెస్తున్నాడు. బుధవారం సాయంత్రం 6 గంటలకు జగన్ ఇంటికి వెళ్లిన నరహరి అర్ధరాత్రి వరకూ డబ్బు విషయమై ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. రాత్రి ఇంటికి వెళ్తున్న నరహరిని భగీరధ కాలనీ వద్ద ఓ కారు ఢీకొంది. నరహిరి గొంతుపై ఒక పదునైన ఆయుధంతో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జగదీశే హత్య చేసినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. నరహరి భార్య కూడా జగదీశ్ పై అనుమానం వ్యక్తం చేసింది. జగదీశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
365399 318159Attractive portion of content. I merely stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Anyway I will likely be subscribing to your augment and even I success you get admission to constantly speedily. 104391