సక్సెస్ కోసం యంగ్ హీరో నిఖిల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ మధ్య వరుస పరాజయాలతో కెరీర్ లో వెనకపడిపోయాడు నిఖిల్. తాజాగా అయన నటించిన అర్జున్ సురవరం ఇంకా విడుదల విషయంలో కష్టాలు పడుతూనే ఉంది. ఈ సినిమా విషయం పక్కన పెట్టిన నిఖిల్ తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో పడ్డాడు.
ఆలోచన చేయడమే కాదు దానికి సంబందించిన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో 2014 లో వచ్చిన కార్తికేయ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తో దానికి సీక్వెల్ చేయాలనీ నిఖిల్ ప్లాన్ చేసాడు. ఆ తరువాత దర్శకుడు చందు వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో అది కుదరలేదు. తాజగా చందుకు సవ్యసాచి ప్లాప్ తరువాత తనకు మంచి సక్సెస్ కావాలి అందుకే ఇద్దరు కలిసి సక్సెస్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలెట్టారు.
అందుకే కార్తికేయ సీక్వెల్ కోసం దర్శకుడు చందు మొండేటి – హీరో నిఖిల్ అండ్ టీమ్ లెటస్ట్ గా పళని వెళ్ళింది .. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి ని దర్శించుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ మొదలెట్టనున్నారట. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
992995 206266This really is something I actually have to try and do lots of analysis into, thanks for the post 862871
536988 163868Good blog! Only issue is im running Firefox on Debian, and the internet site is searching slightly.. weird! Possibly you may want to test it to see for yourself. 614350
977081 850918Thanks for providing such a great post, it was superb and really informative. Its my initial time that I pay a visit to here. I found lots of informative stuff in your post. Keep it up. Thank you. 368158