ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసే దిశగా ఏఐసీసీ ప్రణాళికలు వేస్తోందని.. త్వరలో ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర నేతలకు పిలుపొచ్చిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈక్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పునరుజ్జీవం తీసుకొచ్చే క్రమంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించేందుకు అధిష్ఠానం యోచిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఓవైపు.. మరోవైపు జగన్ ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టిన అధిస్థానం పలు మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీసీసీ అధ్యక్షుడి మార్పు తప్పవదని రాష్ట్ర నేతలకు తెలిపింది. ఈమేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. ఊమెన్ చాందీ ప్రస్తుత చీఫ్ శైలజానాథ్ తోసహా ఇతర ముఖ్య నేతలతో హైదరాబాద్లో గోప్యంగా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర చీఫ్ను మార్చాలనే అధిష్టానం ఉద్దేశాన్ని చాందీ చెప్పారు. ఈక్రమంలో కిరణ్కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే.. ఈ పదవి రేసులో రఘువీరారెడ్డి, పళ్లంరాజు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. మెజారిటీ శాతం మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డికే పగ్గాలు దక్కుతాయని వార్తలు వస్తున్నాయి.
851982 649695I believe that a simple and unassuming manner of life is greatest for everyone, finest both for the body and the mind. 297481
923025 623712I believe this site contains some very amazing details for every person : D. 351256
795691 785693Great job on this post! I genuinely like how you presented your facts and how you made it intriguing and effortless to understand. Thank you. 816346
862353 215799Paper rolls very fantastic read you know alot about this subject i see! 253406