ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా మాజీ సీఎస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరు ఆమోదించారు. ప్రస్తుత ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ముగ్గరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల జాబితాతో ఒక దస్త్రాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించి రాష్ట్ర ప్రభుత్వం. వీరిలో నీలం సాహ్ని పేరును గవర్నర్ ఆమోదించారు.
నీలం సాహ్ని గతంలో ఏపీ ప్రభుత్వ సీఎస్ గా పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉన్నత హోదాల్లో పని చేశారు నీలం సాహ్ని. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్, టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసులకు కూడా వెళ్లారు.
732768 748027Hmm is anyone else having troubles with the images on this blog loading? Im trying to figure out if its a issue on my end or if its the blog. Any responses would be greatly appreciated. 596540
959741 270925Some genuinely marvellous function on behalf with the owner of this internet site, utterly outstanding content. 818402