తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రత్నప్రభ ఈరోజు హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆమెతో కలిసి పవన్ ను కలిసిన వారిలో ఏపీ రాష్బ్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్, పురంధేశ్వరి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఉప ఎన్నికకు సంబంధించిన చర్చలు జరిగినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ప్రచారం, పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
366962 979862Hi! Great post! Please do tell us when I will see a follow up! 158050