Nayanthara: సౌత్ ఇండియాలో మోస్ట్ కలర్ ఫుల్ సినీ కపుల్ అంటే ప్రస్తుత రోజుల్లో విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan)-నయనతార (Nayanthara) పేర్లే వినిపిస్తాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఆమధ్య ఇన్ స్టాలో విఘ్నేశ్ కు వాలెంటైన్ విషెష్ కూడా చెప్పింది. అయితే.. ఒక్కసారిగా నిన్న భర్తను అన్ ఫాలో అయ్యారు. దీంతో విషయం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. వీరిని లవ్ బర్డ్స్ అనుకునే అభిమానుల్లో గందరగోళంతోపాటు అందరినీ ఆలోచనలో పడేసింది.
పొరపాటున జరిగుంటుందని.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. అయితే.. దీనిపై అటు విఘ్నేశ్ కానీ.. నయనతార కానీ ఇంతవరకూ స్పందించలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ విఘ్నేశ్ ను నయనతార ఫాలో అవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోను కూడా ఇన్ స్టాలో కూడా షేర్ చేశారు. దీంతో ఈ గందరగోళానికి వీరిద్దరూ చెక్ పెట్టినట్టయింది. ఇన్ స్టాలో నయనతారకు 78లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం టెస్ట్ సినిమాలో కుముద అనే పాత్రలో నటిస్తున్నారు.