చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారతదేశంలో రెండు రోజుల పాటు పర్యటించడం.. అదీ దక్షిణ భారతదేశానికి ఆయన రావడం.. దేశ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన సందర్భంగా చెప్పుకోవచ్చు. చారిత్రక పట్టణమైన మహాబలిపురంలో జిన్ పింగ్ పర్యటించడమంటే ఆషామాషీ విషయం కాదు. అటు జిన్ పింగ్కి వ్యతిరేకంగా, ఇటు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కొందరు ప్రయత్నించినా, ముందస్తు భద్రతా చర్యల కారణంగా ఆ పప్పులేమీ ఉడకలేదు.
ఇదిలా వుంటే, జిన్ పింగ్ – మోడీ స్నేహం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిన్ పింగ్, భారత పర్యటన వల్ల మన దేశానికి ఎంతో కొంత లాభం అయితే కలిగి తీరుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. చైనా, పాకిస్తాన్ల మధ్య స్నేహం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆయుధ ఒప్పందాలు సహా.. చాలా విషయాల్లో రెండు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలున్నాయి.
అన్నిటికీ మించి భారతదేశంలో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించినట్లుగానే, చైనా కూడా ఆక్రమించేసింది. ‘చైనా ఆక్రమిత కాశ్మీర్ని తిరిగిచ్చేయమని చెప్పండి’ అంటూ భారత ప్రధానికి ఉచిత సలహా ఇస్తోంది కాంగ్రెస్. ఆర్టికల్ 370 రద్దుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న భారత్, ఈ క్రమంలో చైనా ఆక్రమిత కాశ్మీర్పైనా కన్నేసిన మాట వాస్తవం.
అయితే, ఆ విషయమై చైనా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఇది సమయం కానే కాదు. భారత్ – చైనా మధ్య వాణిజ్య సంబంధాలున్నాయి. అవి ఇకపై మరింత మెరుగవుతాయన్నది నిర్వివాదాంశం. అంతర్జాతీయ వేదికలపై భారత్కి వ్యతిరేకంగా చైనా ఇక ముందు మాట్లాడదని అనుకోలేం. కానీ, కొంత మేర ఆ నెగెటివిటీ చైనాలో తగ్గుతుందని మాత్రం ఆశించొచ్చు.
ఇక, చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. గతంలో అమెరికా ఇలాగే తొలుత పాక్తో స్నేహాన్ని నడిపి.. ఆ తర్వాత భారత్కి దగ్గరయ్యింది. రేప్పొద్దున్న చైనా కూడా, పాకిస్తాన్కి దూరమై, భారత్కి దగ్గరైతే.! వినడానికి బాగానే వున్నా, ఇదేమంత తేలికైన వ్యవహారం ఆదు. అలాగని అసాధ్యం కూడా కాదు.
927040 308507Youve truly written a quite very good quality post here. Thank you quite much 77450