నారా లోకేష్ని సోషల్ మీడియా ఎప్పుడో ‘పప్పు’గా మార్చేసింది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ ‘పప్పు’ అనే పేరుకి పర్యాయపదంగా మారిపోయారంటే, ఆ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు వీరిపై ఆ బ్రాండ్ని బలవంతంగా రుద్దేశారన్నమాట. నారా లోకేష్ – బ్రాహ్మణిల పెళ్ళి జరిగి 12 ఏళ్ళయ్యింది. అంటే పుష్కర కాలం అన్నమాట.
లోకేష్ – బ్రాహ్మణికి సంబంధించి ఇది నిజంగానే స్పెషల్ మూమెంట్. అందుకేనేమో, హార్ట్ టచింగ్ మెసేజ్ పెట్టాడు సోషల్ మీడియాలో నారా లోకేష్ తన భార్యని ఉద్దేశించి 12 ఏళ్ళు 144 నెలలు.. అంటూ రోజులు, గంటలతో సహా లెక్కలు కట్టి, నారా లోకేష్ తన ప్రత్యేకతను అలాగే బ్రాహ్మణి మీద ప్రేమను చాటుకున్నాడు. అయితే, సోషల్ మీడియాలో లోకేష్కి ప్రత్యర్థులు చాలా ఎక్కువ కదా.! వారు చిమ్మే విద్వేషం ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
‘ఇంతకీ, మీ భార్యామణి పప్పు బాగానే వండుతుంది కదా.!’ అంటూ ఓ ‘హేటర్’ తన పైత్యాన్ని చాటుకున్నాడు. ఇంకొంతమంది జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అయితే, చాలామంది మాత్రం లోకేష్కి, బ్రాహ్మణికి ‘స్పెషల్ డే’ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇలాంటి సందర్భాల్లో విమర్శలు తగదు.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయొద్దు..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు కూడా, హేటర్స్కి సలహా ఇవ్వడం గమనార్హం.
రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. కానీ, ఆయా రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలే రాజకీయ పార్టీలకు ఎజెండాలుగా మారిపోతున్న రోజులివి. దాంతో, లోకేష్కి ప్రత్యేకమైన రోజున కూడా జుగుప్సాకరమైన విమర్శలు తప్పలేదన్నమాట.