తమిళ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి కేసు వేసింది. ఓ సినిమా షూటింగ్ లో అర్జున్ తనను లైగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి పలువురు ప్రముఖులు రంగంలోకి దిగారు. అయినా ఫలితం దక్కలేదు. దాంతో హీరోయిన్ శృతి కోర్టును ఆశ్రయించింది.
ప్రస్తుతం ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విషయం ఇంకా కోర్టులో ఉండగానే .. హీరోయిన్ శృతి పై మరో కేసు ఫైల్ అయింది. శృతి పై పరువునష్టం దావా కేసు కింద 5 కోట్లు ఫైల్ చేశారు. శృతి పై పరువు నష్టం దావా కేసు ఎవరు వేశారనేగా మీ అనుమానం .. ఆ కేసు వేసింది ఎవరో కాదు .. అర్జున్ కూతురు ఐశ్వర్య ? తన తండ్రి పరువును బజారుకు ఈడుస్తుంది అంటూ శృతి పై ఆమె కేసు ఫైల్ చేసింది.
దానిపై శృతి కోర్టుకు వెళితే అక్కడ నిరాశే ఎదురైంది. ఈ కేసులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేయడంతో శృతి కథ అడ్డం తిరిగింది. మొత్తానికి ఎదో చేద్దామని అనుకున్న శృతి కి మరో గట్టి దెబ్బ తగిలేలా ఉందని అంటున్నారు సినీ జనాలు.
454107 389529I was trying to uncover this. Genuinely refreshing take on the info. Thanks a whole lot. 776001
707266 261983This site can be a walk-through its the info you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and youll undoubtedly discover it. 655806
915506 100194I gotta favorite this internet site it seems handy very useful 541858