కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. నిజానికి, కాపు సామాజిక వర్గం కొత్తగా రిజర్వేషన్లు కోరడంలేదు. చాలా ఏళ్ళ క్రితం తమకున్న బీసీ-రిజర్వేషన్ని తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే కోరుతోంది. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం పేరుతో ఎంతోమంది రాజకీయంగా ఎదిగారు. కాపు సామాజిక వర్గం తరఫున ఎవరు నిజాయితీగా నిలబడినా, వాళ్ళందర్నీ తొక్కేశారు కూడా.!
ఇక, ఇటీవలి కాలంలో కాపు ఉద్యమం విషయానికొస్తే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. కాపు ఉద్యమం పేరు చెప్పి ఆయన పొందిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమం పేరుతో ముద్రగడ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇంతా చేసి, ముద్రగడ ఏమన్నా సాధించారా.? అంటే అదీ లేదు.
ఇప్పుడేమో, కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటన విడుదల చేశారు. అందుక్కారణాలు చెబుతూ, చాలామంది కాపు నేతలు తనపై నిందారోపణలు చేస్తున్నారని వాపోయారు. నాయకుడన్నవాడెవడైనా ఎవరో ఆరోపణలు చేస్తే ఉద్యమం నుంచి తప్పుకుంటాడా.? నవ్విపోదురుగాక మనకేటి.. అన్నట్టుంది ఇప్పుడు ఈ వ్యవహారం. చంద్రబాబు హయాంలో ‘కాపు ఉద్యమం’ పేరుతో ‘అలజడి’ సృష్టించి, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో ఉద్యమాన్ని వదిలేస్తున్నట్లు ముద్రగడ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
సహజంగానే టీడీపీ అనుకూల మీడియా, ‘ఇదంతా వైసీపీ కుట్ర..’ అని ఆరోపిస్తుంది. దానికి వైసీపీ నుంచి ఎలాగూ కౌంటర్ ఎటాక్ వుంటుందనుకోండి.. అది వేరే విషయం. కానీ, ఇక్కడ ముద్రగడ ‘వాక్ ఔట్’ వెనుక రాజకీయం సుస్పష్టం. కాపు సామాజిక వర్గంలో మరోమారు చీలిక తెచ్చేందుకోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి, కాపు రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన సందర్భమిది.
ఎవరి బెదిరింపులకో, ఎవరి ప్రలోభాలకో లొంగిపోయి ముద్రగడ, ఈ ‘వాక్ ఔట్’ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం, ఆవేదన కాపు సామాజిక వర్గం నుంచి సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతోంది. ‘కాపు జాతి’ అంటూ ఎలుగెత్తి చాటిన ముద్రగడ, ఇప్పుడు ఆ జాతికి తీవ్ర ద్రోహం చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న దరిమిలా, ఆయన ఎవరి ప్రలోభాలతో ఇదంతా చేస్తున్నారన్న విమర్శలకు ఆయన్నుంచి స్పష్టమైన సమాధానమొస్తుందా.?
534524 15487Billiard is really a game which is mostly played by the high class individuals 572735