టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్లపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా విలేకరులతో మాట్లాడారు. కోడెలకు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వనప్పుడు అయ్యన్న ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబుకు సీఎం పదవిని, లోకేశ్ కు మంత్రి పదవిని, అయ్యన్నకు ఎమ్మెల్యే పదవిని మొత్తంగా టీడీపీ అధికారం నుంచి పీకేశారని ఇంకేం పీకాలని తనదైన స్టయిల్లో అన్నారు.
అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఆ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో టీడీపీ, అయ్యన్న పాత్రుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
సినిమా టికెట్ల విక్రయంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. సినీ పెద్దల కోరిక మీదటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చిరంజీవి, నాగార్జున, మరికొందరు సినీ పెద్దలు కోరిన మీదటే రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లు ఆన్ లైన్లో విక్రయించేందుకు సిద్ధమైందని ఎమ్మెల్యే రోజా అన్నారు.
539774 588147I just now discovered your weblog post and now Im remember to start with followers. 558666
213634 424271Blogs ou need to be reading […]Here is a great Blog You might Discover Intriguing that we Encourage You[…] 348349