టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిద్దరికీ జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. 2017లో వీరిద్దరి నుంచి సేకరించిన బ్లడ్, హెయిర్, నెయిల్ సాంపిల్స్ పై పరీక్షలు నిర్వహించిన ఎఫ్ఎస్ఎల్ కీలక నివేదిక ఇచ్చింది.
వారిద్దరి శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు లేవని తన తుది నివేదికను ఎక్సైజ్ విభాగానికి అందించింది. FSL ఇచ్చిన క్లీన్ చిట్ అంశాలను పొందుపరుస్తూ… ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోర్టులో దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ నివేదిక పూరి జగన్నాధ్ కు, తరుణ్ కు ఊరటనిచ్చేదే. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ముమైత్ ఖాన్, రానా, తనీశ్.. తదితరులను విచారించిన సంగతి తెలిసిందే.
175219 457027Every e-mail you send need to have your signature with the link to your web internet site or weblog. That normally brings in some visitors. 793948