పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి మృతి ఎంతో బాధాకరమని.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హనుమకొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ..
‘కాలేజీలో ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృతి చెందడం బాధాకరం. ఆమె మృతికి కారకులైన నిందితులు సైఫ్ అయినా.. సంజయ్ అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇస్తున్నా’ అని అన్నారు.
నిమ్స్ లో అయిదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రీతి మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 9.10గంటలకు ఆమె మృతి చెందినట్టు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతిది ఆత్మహత్య కాదని.. హత్య అని ఆమె తండ్రి ఆరోపించారు. ప్రిన్సిపాల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
197245 682468You made some decent points there. I looked on the web for the difficulty and discovered most individuals will go coupled with along along with your site. 492159
408008 780195Just wanna input which you have a really good website , I enjoy the pattern it truly stands out. 576414