మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న ఆచార్య చిత్రం కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా కుదర్లేదు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
దేవాదాయ శాఖ ఆఫీసర్ గా ఈ చిత్రంలో చిరంజీవి నటిస్తాడని ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి డబల్ రోల్ చేస్తున్నాడని, అదే ఈ చిత్రానికి మెయిన్ షాక్ ఫ్యాక్టర్ అని, అందుకనే ఆచార్య టీమ్ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుదామనుకున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
జులై మొదటి వారం నుండి ఆచార్య చిత్ర షూటింగ్ ను తిరిగి ప్రారంభిద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ప్రబలుతున్న కారణంగా ఆ నిర్ణయాన్ని చిరంజీవి అండ్ కో సంయుక్తంగా విరమించుకున్నారు. ఆగస్ట్ తర్వాత పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆచార్య టీమ్ భావిస్తోంది.
927006 736216Rattling clean internet website , thanks for this post. 696508
28485 161413noutati interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchiriere vile vacanta ?. 718151
879972 163812Cheap Gucci Handbags Is usually blogengine considerably better than wp for reasons unknown? Need to be which is turning out to be popluar today. 581419