ప్రస్తుతం కరోనా అనే మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చైనా, ఇటలీ, అమెరికా లాంటి దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. చాలా వేగంగా ప్రబలుతున్న ఈ కరోనానికి అరికట్టడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ని చాలా త్వరగానే అమలు చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ లాక్ డౌన్ ని చాలా పర్ఫెక్ట్ గా పాటిస్తున్నాయి.
ఎలాంటి విపత్తు వచ్చిన ముందుండే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం ఫండ్ కి భారీ మొత్తాన్ని డొనేట్ చేశారు. అంటే కాకుండా షూటింగ్స్ లేకపోవడంతో డైలీ పనిచేసే సినీ కార్మికులకు పని లేకుండా పోయింది. అలాంటి వారిని ఆదుకోవడం తెలుగు స్టార్స్ బాధ్యత. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ అని ఒకదానిని స్థాపించి, సెలబ్రిటీస్ అందరి నుంచీ విరాళాలు సేకరిస్తున్నారు.
అంతే కాకుండా సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకి కరోనా గురించి వివరంగా చెప్తున్నారు. అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కలిసి కరోనా క్రైసిస్ కమిటీ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ పాటగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సంగీత దర్శకుడు కోటి ఈ పాటకి రూప కల్పనా చేశారు. ఈ పాత ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇలాంటి టైములో కూడా ఫాన్స్ అండ్ ప్రజలని మరింత అప్రమత్తంగా ఉంచడం కోసం ఈ పాట చేసిన స్టార్స్ అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి.
800949 538552An attention-grabbing dialogue is value comment. I believe that you require to write more on this matter, it wont be a taboo subject nonetheless usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 527829
376937 780055Wow, superb blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall appear of your web site is magnificent, as nicely as the content! xrumer 715368