తెలంగాణలో కారుకు ఎదురు లేకుండా దూసుకుపోతున్నది. ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించిన తెరాస పార్టీ అదే స్పీడ్ లో దూసుకుపోతున్నది. కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న మంథనిలో కూడా తెరాస పార్టీ హవా సాగిస్తోంది. అయితే, ఈ నియోజక వర్గంలో ఓ బ్యాలెట్ బాక్స్ లో ఓ లెటర్ దొరికింది. తెరాస ను పొగుడుతూ ఉన్నది ఆ లెటర్. తెరాస పార్టీకి ఎదురు లేదని, కెసిఆర్ తమ దేవుడు అని పొగుడుతూ లెటర్ రాశారు. ఈ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి విషయాలు సహజంగానే బయటకు వస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న మంథనిలో ఇలాంటి లెటర్ రావడం విచిత్రం. మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నేత శ్రీధర్ బాబు నాయకత్వం వహిస్తున్నారు. గతంలో అయన మంత్రిగా పనిచేశారు. అక్కడ ఆయనకు మంచి పేరు కూడా ఉన్నది. అటువంటి చోట ఇలాంటి లెటర్ దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తెరాస పార్టీ డబ్బును విపరీతంగా పంపిణి చేసిందని డబ్బు పుచ్చుకున్న వ్యక్తులు ఇలా చేస్తున్నారని అంటున్నారు.
అటుంచితే నిన్నటి రోజున కేటీఆర్ దావోస్ నుంచి తిరిగి వస్తూ ఓ ట్వీట్ చేశారు. దావోస్ నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నాను. రేపటి రిజల్ట్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి నెటిజన్ ఒకరు ఘాటు రిప్లై ఇచ్చారు. డబ్బులు దండిగా పంచితే గెలవకుండా ఎందుకు ఉంటుంది అని రిప్లై ఇవ్వడంతో తెరాస అభిమానులు షాక్ షాక్ అయ్యారు. ట్వీట్స్ కు రిప్లై ఇచ్చే కేటీఆర్, ఈ నెటిజన్ చేసిన ట్వీట్ కు మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అంటే డబ్బుల హవా నడిచిందని అర్ధం చేసుకోవచ్చు.