మెగా హీరో సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్ పై నుంచి జారిపడి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయితేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సినీ సెలబ్రిటీలు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తూండగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా సాయితేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో మంచు లక్ష్మీప్రసన్న అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయితేజ్ ను పరామర్శించారు.
ఈసందర్భంగా సాయితేజ్ కు జరిగిన ప్రమాదంపై వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసినంత వరకూ తేజ్ ఎంతో బాధ్యత ఉన్న పౌరుడు. రూల్స్ కు వ్యతిరేకంగా వెళ్లే వ్యక్తి కాదు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే తనకు ప్రమాదం జరిగింది దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి. ఇప్పుడతను క్షేమంగా ఉన్నాడు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని అందరం దేవుడ్ని ప్రార్ధిద్దాం’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
213578 901794When do you believe this Real Estate market will go back in a positive direction? Or is it still too early to tell? We are seeing a great deal of housing foreclosures in Altamonte Springs Florida. What about you? Would love to get your feedback on this. 71589
854151 47141Some truly quality weblog posts on this web site , saved to my bookmarks . 216469