Deep fake: డీప్ ఫేక్ (Deep fake) టెక్నాలజీతో హీరోయిన్ రష్మికపై సృష్టించిన మార్ఫింగ్ వీడియో సృష్టించిన కలకలం తెలిసిందే. ఇప్పుడీ టెక్నాలజీతో కేరళ (Kerala) లో వ్యక్తి నుంచి రూ.40వేలు నగదు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే..
కోయ్ కోడ్ కు చెందిన పీఎస్ రాధాకృష్ణన్ కోల్ ఇండియా మాజీ ఉద్యోగి. జూలై 9న తెలియని నెంబర్ నుంచి తనతో 40ఏళ్లు కలిసి పని చేసిన వేణుకుమార్ వాట్సాప్ కాల్.. వీడియో కాల్.. ఫొటోలు కూడా పంపించారు. దుబాయ్ నుంచి చెల్లెలి సర్జరీ కోసం ముంబై వస్తున్నానని సాయంత్రానికి రూ.40వేలు కావాలని అడిగాడు. స్నేహితుడు అడగడంతో రూ.40వేలు పంపించారు రాధాకృష్ణన్.
గంటలో మరో రూ.35వేలు కావాలని ఫోన్ చేయడంతో అనుమానం వచ్చి ఫ్రెండ్స్ లిస్టులో వేణు నెంబరుకి ఫోన్ చేయగా ఆయన కులాసాగా మాట్లాడారు. తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అహ్మదాబాద్ కు చెందిన కౌశల్ షా ప్రధాన నిందితుడిగా గుర్తించి మరో నిందితుడు షేక్ ముర్తుజామియా భాయ్ ని అరెస్టు చేశారు. నగదును గ్యాంబ్లింగ్ సంస్థకు బదిలీ చేసినట్టు తెలిపారు.