Switch to English

మమ్ముట్టి ‘భ్రమయుగం’ ను తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,766FansLike
57,764FollowersFollow

లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమయుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది.

నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా యొక్క వైవిధ్యమైన కథాంశానికి, ఇందులోని మమ్ముట్టి అద్భుతమైన నటనను ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి.

మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.

రచయిత-దర్శకుడు రాహుల్ సదాశివన్, సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్, ఆర్ట్ డైరెక్టర్ జోతిష్ శంకర్, సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్, ఎడిటర్ షఫీక్ మహమ్మద్ అలీ, సౌండ్ డిజైనర్ జయదేవన్ చక్కాడత్, ఫైనల్ మిక్స్ ఇంజనీర్ ఎం.ఆర్. రాజాకృష్ణన్.. ఇలా చిత్ర బృందమంతా మనసుపెట్టి పనిచేసి, సమిష్టి కృషితో అద్భుతమైన అవుట్ పుట్ ని అందించారు.

మలయాళం భాషలో ఇప్పటికే ‘భ్రమయుగం’ చిత్రాన్ని వీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు.. ఇది ప్రతి సినీ ప్రియుడు తప్పక చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని చెబుతున్నారు.

విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగ వంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని విడుదల చేసిన సితార సంస్థ.. ఇప్పుడు ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తోంది.

10 COMMENTS

సినిమా

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే...

Jr Ntr: ఆ మహానుభావుడి బయోపిక్ లో ఎన్టీఆర్..! రాజమౌళి దర్శకుడు.....

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వీరి కలయికలో రానుందా..? అంటే ఔనంటోంది బాలీవుడ్ మీడియా. దీనిపై...

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి...

రాజకీయం

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే "P-4". మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది....

ఎక్కువ చదివినవి

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన,...

చొక్కా విప్పుతున్న మహేష్..?

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29 ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ లుక్స్, యాక్షన్ సీన్స్ అన్ని...

VD14 పోస్టర్ చూశారా..!

త్వరలో కింగ్ డమ్ సినిమాతో రాబోతున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ రెండు భారీ సినిమాలను లైన్ లో పెట్టాడు. విజయ్ దేవరకొండ 13వ సినిమాగా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక సినిమా...

పాకిస్తాన్ బతకాలంటే, తీవ్రవాదం చావాల్సిందే: ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. స్వల్ప విరామం అంతే.! పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క తీవ్రవాది, ఎలాంటి ఘాతుకానికి పాల్పడినా, ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా వుంటుంది. నదిలో నీళ్ళు, రక్తం.. ఒకేసారి పారేందుకు...

ఇండియా, పాక్ యుద్ధం.. సమంత శుభం సక్సెస్ మీట్ క్యాన్సిల్..!

ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాయాది పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్...