కరోనా వైరస్ ఈపేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపుగా 13వేలమంది వరకు మరణించారు. చైనా కంటే ఇటలీలోనే అత్యధికంగా వైరస్ ప్రభావం అధికంగా ఉన్నది. రోజు రోజుకు అక్కడ సమస్య తీవ్రం అవుతున్నది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 793 మంది మరణించారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో కూడా వైరస్ వ్యాపించడం, రెండో దశ నుంచి మూడో దశకు మారబోతున్న తరుణంలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చిన సమయంలో కొన్ని అనుమాలు ఉన్నాయి. ఈ కర్ఫ్యూ వలన ఉపయోగంఏంటి … ఇండియాలో ఇది సాధ్యం అవుతుందా అనే అనుమానాలు కలిగాయి.
కానీ, ఈరోజు ఇండియాలో జరుగుతున్న జనతా కర్ఫ్యూ ను బట్టి చూస్తుంటే విజయవంతం అయ్యిందనే చెప్పాలి. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు బయటకు రావడం మానేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటె, బయట ఉన్న కరోనా వైరస్ బలహీనపడుతుంది. కరోనా చైన్ తెగిపోతుంది. ఫలితంగా మూడో దశలోకి వెళ్లకుండా కరోనాను అడ్డుకట్ట వేయవచ్చు.
అంతేకాదు, వైద్యులు కరోనా పాజిటివ్ కేసులపై దృష్టిపెట్టి వైద్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. జనతా కర్ఫ్యూ ఇండియాలో సక్సెస్ అవుతుందా కాదా అని ఆలోచించారు. కానీ, ఇండియాలో జనతా కర్ఫ్యూ సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇండియాలో ఈ కర్ఫ్యూ పూర్తిగా సక్సెస్ అయితే, అమెరికా వంటి దేశాలు కూడా ఈ జనతా కర్ఫ్యూను ఫాలో కావాలని చూస్తున్నాయి.
523237 898092Wholesale Low-cost Handbags Will you be ok merely repost this on my web site? Ive to allow credit where it can be due. Have got a fantastic day! 337744