గత రెండు రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు, మహేష్ అభిమానులు కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. దానికి కారణం అందరూ త్వరలో పట్టాలెక్కేస్తుంది అనుకున్న వంశీ పైడిపల్లి సినిమా ప్రస్తుతానికి ఆగిపోవడం. మహేష్ కి మేజర్ స్టోరీ వెర్షన్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు.
కానీ నెక్స్ట్ ఎవరితో చేయాలి అనే విషయంపై కన్ఫ్యూషన్ లో ఉన్నారు. మహేష్ బాబుకి ఓ నూతన దర్శకుడు కథ చెప్పారు. నచ్చింది కానీ కొత్త దర్శకుడితో వెళ్ళడం ఎంత వరకూ కరెక్ట్ అనే సందిగ్ధంలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు గతంలో రిజెక్ట్ చేసి పంపేసిన వాళ్ళ లిస్ట్ తీశారు. అందులో ఫైనల్ గా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కి కాల్ వెళ్ళింది.
గతంలో పరశురామ్ మహేష్ బాబుకి కథ చెప్పి చాల రోజులే వెయిట్ చేసాడు. కానీ ఫైనల్ గా మహేష్ నో చెప్పడంతో అక్కడి నుంచీ వచ్చేసి నాగ చైతన్యకి మరో కథని వినిపించి 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు మహేష్ కాల్ చేసి పరశురామ్ ని త్వరగా కథ సిద్ధం చేయమని చెప్పారని సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే అవకాశం ఉంది.
సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత మోడీ=యూ నెలలు విరామం ప్రకటించిన మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమాల కథలపై ద్రుష్టి పెట్టారు. హిట్ ఇచ్చారు అని కాకుండా కంప్లీట్ స్క్రిప్ట్ ని బట్టే ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడం చూసి అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గంటలో అలా హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు మహేష్ బాబుకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
301245 150550Hey! Wonderful post! Please do tell us when we can see a follow up! 728492
217753 552111I truly like your writing style, fantastic data, thankyou for posting : D. 168195