Mahesh Babu: తెలుగు సినిమా సూపర్ స్టార్, హీరో కృష్ణ (Krishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఎన్నో మరపురాని పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన గతేడాది కన్నుమూశారు. ఆమధ్య ఏలూరుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కృష్ణ విగ్రహాలు ఏర్పాటు చేశారు అభిమానులు. ఇప్పుడు విజయవాడలో కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే.. ఈ విగ్రహాన్ని లెజండరీ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ఆవిష్కరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాశ్ (Devineni Avinash) , డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొనగా కమల్ హాసన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, హీరో మహేశ్ (Mahesh Babu) దీనిపై ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు. ‘విజయవాడలో నాన్నగారి విగ్రహావిష్కరణకు హాజరైన కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నిజంగా గర్వకారణం. ఆయన వదిలి వెళ్లిన వారసత్వానికి నివాళులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ఇండియన్-2 షూటింగ్ నిమిత్తం విజయవాడలో ఉన్న కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Heartfelt gratitude to @ikamalhaasan Sir and @DevineniAvi Garu for gracing the inaugural event of Krishna garu’s statue in Vijayawada. Truly honoured to have them unveil Nanna garu’s statue, a homage to the legacy he left behind. Also, a big thank you to all the fans from the… pic.twitter.com/4YUOidCR8d
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2023