సూపర్ స్టార్ మహేష్బాబు 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మహేష్ 27వ చిత్రంకు పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. జూన్ లేదా జులై నుండి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఆ సినిమాను పూర్తి చేసేలా మహేష్బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27వ చిత్రం రాకముందే 28వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ 28వ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఛాన్స్ను అనీల్ రావిపూడికి ఇచ్చినా కూడా ఆయన కాస్త సమయం కావాలని విజ్ఞప్తి చేశాడట. దాంతో ఆ ఆఫర్ కాస్త వెంకీ కుడుములకు దక్కిందని తెలుస్తోంది.
భీష్మ చిత్రం విడుదలై సక్సెస్ను దక్కించుకున్న నేపథ్యంలో మహేష్బాబు స్వయంగా వెంకీని పిలిచాడని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. పరశురామ్ దర్శకత్వంలో కంటే ముందు వెంకీ దర్శకత్వంలో అనుకున్నారు. కాని లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పరశురామ్ దర్శకత్వంలో సినిమా వచ్చిన తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీ రాబోతుందట. ఈ రెండు సినిమాలకు కేవలం నాలుగు అయిదు నెలల గ్యాప్ ఉంటుందని తెలుస్తోంది.
513657 747121jobs for high school students – Search for Jobs on our web site, we give several very good links towards the best and biggest Portals to getting a Job as a high school student! 548818
945313 645345Nice blog here! soon after reading, i decide to buy a sleeping bag ASAP 437311
424585 207737I see something truly interesting about your web internet site so I saved to bookmarks . 27926