తమిళనాడు లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలకు అటూ ఇటూగా వుంటోంది. దాదాపు 200 రోజువారీ మరణాలు చోటు చేసుకుంటున్నాయక్కడ. ప్రతిరోజూ లక్షన్నర మందికి కరోనా టెస్టులు చేస్తున్నారు తమిళనాడులో. అదే ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, లక్షకు అటూ ఇటూగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు అటూ ఇటూగా వుంటోంది.
తమిళనాడు స్థాయిలో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ కరోనా టెస్టులు చేస్తే, పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా వుంటుందన్నది నిర్వివాదాంశం. అయితే, తమిళనాడులో లాక్ డౌన్ పెట్టగా లేనిది, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమెందుకు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపడంలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దెబ్బ తింటాయి. ప్రజల జీవన గమనం కూడా దెబ్బ తింటుంది. అయినాగానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప ఇంకో మార్గం లేదు.
కాగా, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 18 గంటలపాటు కర్ఫ్యూ కొనసాగుతోంది. కేవలం 6 గంటల సమయమే ప్రజలు తిరగడానికి అవకాశం కల్పిస్తున్నారు.. అదీ కూడా అనేక ఆంక్షల నడుమ. లాక్ డౌన్ విధించాలా.? వద్దా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కరోనా టెస్టులు ఎక్కువగా చేయాల్సిన అవసరం మాత్రం వుంది. అదే సమయంలో, కరోనా బాధితులకు రాష్ట్రంలో అందాల్సిన స్థాయిలో వైద్య చికిత్స అందడంలేదన్న విమర్శలున్నాయి.
తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల వైపు చూస్తున్నారు ఏపీలోని కరోనా బాధితుల్లో కొందరు. ఇది రాష్ట్రంలో కరోనా వైద్య చికిత్స సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తోంది. ఆక్సిజన్ కొరత, మెడిసిన్స్ కొరత.. సహా అనేక సమస్యలు రాష్ట్రంలో వున్నాయి. అలాగని ఇతర రాష్ట్రాల్లో లేవని కాదు. అయినాగానీ, ఇతర రాష్ట్రాల్లోనే తమకు మెరుగైన వైద్యం అందుతోందని కరోనా బాధితులు భావిస్తుండడం గమనార్హం.
168475 490284I adore reading and I conceive this website got some genuinely utilitarian stuff on it! . 334958
809728 826727What a lovely blog page. I will definitely be back once more. Please maintain writing! 353242