తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. భూకబ్జా ఆరోపణలపై ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. పార్టీ నుంచి బహిష్కరించే దిశలు ఆలోచనలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈటల తన రాజకీయ భవితవ్యంపై అనుచరులు, కార్యకర్తలతో వరుస భేటీలు జరుపుతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా.. లేక మరో పార్టీలో చేరాలా అనేదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈటలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలతో భేటీ అయి పలు అంశాలపై చర్చించగా.. తాజాగా రాములు నాయక్ ఈటల వద్దకు వెళ్లి దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి ఈటల వద్దకు వెళ్లారా లేక ఇతరత్రా అంశాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు అందరితో వరుస భేటీలు జరుపుతున్న ఈటల తన మనసులో ఏముందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
603068 880037I gotta bookmark this internet site it seems extremely beneficial invaluable 451313
998150 745428Your writing style has been amazed me. Thank you, quite great post. 525782