కరోనా కల్లోలం సమయంలో ఎందరో అభాగ్యులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కరోనాతో తీవ్ర అస్వస్థతకు లోనైన భారతి అనే యువతి చికిత్స పొందుతూ మరణించడాన్ని తట్టుకోలేకపోయారు. ఆమెను బతికించడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ చివరు విషాదమే మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడింది. ఆమె ఊపిరితిత్తులు 85 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్.. ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలియడంతో సోనూ తీవ్రంగా ఆవేదన వ్యక్తంచేశారు. ‘నెలరోజులపాటు ఆమె జీవితంతో పోరాడింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను ఆమెను బతికిస్తా అనుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మన ఊహించలేం. నా హృదయం ముక్కలైంది’ అని సోనూసూద్ ట్వీట్ లో ఆవేదన వ్యక్తంచేశారు.
436437 219989Disgrace on the search Google for now not positioning this post higher! Come on over and consult with my website. 6310
685283 889543The post posted was extremely informative and useful. You people are doing a great job. Maintain going. 94686