కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో రైతులు సాగిస్తున్న ఉద్యమం రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. వారి ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చలి విపరీతంగా వణికిస్తున్నా.. రైతులు వెనక్కి తగ్గడంలేదు. చట్టాలను రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం వద్దని స్పష్టంచేస్తున్నారు. 23 రోజులుగా సాగుతున్న ఉద్యమంలో మహిళలు కూడా భాగస్వాములవుతున్నారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రోడ్లపైకి చేరి అన్నదాతలకు బాసటగా నిలుస్తున్నారు.
తొలుత పంజాబ్ మహిళలు మాత్రమే ఈ నిరసనల్లో పాల్గొనగా.. తాజాగా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ లకు చెందిన అతివలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ధర్నా ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తూనే మరోవైపు రైతన్నలకు వంటలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనకు మహిళా శక్తి కూడా తోడు కావడంతో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎవరెన్ని చెప్పినా అటు కేంద్రం చట్టాల రద్దుకు అంగీకరించడంలేదు. సుప్రీంకోర్టు సైతం ఈ ఆందోళనలను వెంటనే విరమింపజేయాలని కేంద్రానికి సూచించింది.
421058 724446very good publish, i undoubtedly really like this internet web site, carry on it 304569
175505 112696This internet website is my inspiration , actually exceptional layout and perfect topic matter. 878714
162818 949003Some truly quality blog posts on this internet web site , saved to my bookmarks . 121308