రైతు పరిస్థితి ఎప్పుడు ఏదో ఒక విధంగా సమస్యల సుడిగుండం మాదిరిగా ఉంటుంది. విత్తనాలు కొనేప్పటి నుండి మొదలుకుని మార్కెట్ లో ధాన్యం అమ్మే వరకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరు కాలం కష్టపడి ఎండనక వాన అనకా పంటను సాకిన రైతుకు ఆ పంటను అమ్ముకోవడానికి సరైన అవకాశం లేకుండా పోయింది.
తెలంగాణ లో ఈ సారి రికార్డు స్థాయిలో వరి సాగుబడి జరిగింది. ప్రభుత్వం సూచించిన మేరకు సన్నాలను రైతులు సాగు చేయడం జరిగింది. కాని ఆ ధాన్యంను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కనిపించడం లేదు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంతో పాటు సూర్యపేట జిల్లా కేంద్రం మరియు కోదాడలో కూడా దాన్యం కొనుగోలు లేక కిలో మీటర్ల మేరకు రైతుల వరి ధాన్యం ట్రాక్టర్లు నిలబడి పోయాయి.
ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో రైస్ మిల్లులకు ధాన్యం పోటెత్తింది. ట్రాక్టర్ లో ధాన్యం రోజుల తరబడి ఉండటంతో రంగు మారుతుంది. రంగు మారుతున్న ధాన్యంను కొనుగోలుకు రైస్ మిల్లలు ఒప్పుకోవడం లేదు. దాంతో రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలుకు గ్రామాల్లోనే ఏర్పాట్లు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మిర్యాలగూడెం మిల్లుల వద్ద ప్రతి రోజు ఏడు వందల నుండి ఎనిమిది వందల ట్రాక్టర్ల వరకు నిల్చుని ఉంటున్నాయి. ఈ నెల చివరి వరకు ధాన్యం వస్తూనే ఉంటుంది. కనుక అధికారులు ఇప్పటికైనా మేలుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.
21311 658310Wonderful post man, keep the nice function, just shared this with the friendz 594611