కొత్త వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆ రాష్ట్రాల రైతులు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీకి కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరికి మద్దతుగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
2015లో కేంద్రం ఆయనకు బహుకరించిన దేశపు రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ ను కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా పద్మ పురస్కారాన్ని ఇచ్చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఇటివల ఎన్టీఏ నుంచి శిరోమణి అకాళీదళ్ వైదొలిగిన సంగతి కూడా తెలిసిందే. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కూడా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలసిందే.
మరోవైపు పంజాబ్ కు చెందిన క్రీడాకారులు కూడా తమ పురస్కారాలు వెనక్కి ఇచ్చేస్తామని అంటున్నారు. డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లి రైతులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా పరిస్థితులు మారిపోయాయి. వేలాదిగా రైతులు తరలి వస్తూండటంతో కేంద్రం ఇటివలే రైతులతో చర్చలు కూడా జరిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని.. వాటిని రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
398506 430598An fascinating discussion is worth comment. I believe which you need to write a lot more on this matter, it might not be a taboo subject but normally individuals are not enough to speak on such topics. Towards the next. Cheers 891444
687344 371994Terrific work! That is the kind of information that are supposed to be shared around the net. 249819