దర్శక ధీరుడు రాజమౌళి, బాహుబలి వంటి తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలోని ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల ఆధారంగా కల్పినికత జోడించి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా విదేశీ భామ ఒలీవియా మోరిస్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.
ఇటీవలే రాజమౌళి అండ్ కో ఈ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసారు. దాని ప్రకారం ఆర్ ఆర్ ఆర్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు 10 భాషల్లో విడుదల కానుంది. దీంతో ముందు చెప్పినట్లుగా జులై 30, 2020న ఈ సినిమా విడుదల కాదని తేలిపోయింది.
ఇక ఈ చిత్ర విశేషాల సంగతికొస్తే, ఈ చిత్ర తాజా షూటింగ్ మన్యంలో జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్న రాజమౌళి, తన దర్శకత్వ బృందంతో విశాఖ జిల్లా పాడేరు మండలం మోదపల్లి, డల్లపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలను గుర్తించారు. ఇక్కడి కాఫీ తోటల్లో దాదాపు ఆరు రోజుల పాటు క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఈరోజే ఎన్టీఆర్ మన్యం ప్రాంతానికి చేరుకున్నాడు. ప్రాంతాల పరిశీలనతో పాటు అసిస్టెంట్ దర్శకులకు రేపు ఏ సీన్లు షూటింగ్ చేయాలో కూడా వివరించాడు రాజమౌళి.
679895 400335Hiya! awesome blog! I happen to be a every day visitor to your web site (somewhat far more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am looking forward for more to come! 843160