రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడీ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా ఇటలీలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. రవితేజతో పాటు హీరోయిన్ ఇంకా అనసూయ కీలక నటీనటులు అంతా కూడా ఇటలీ వెళ్లారు. అక్కడ చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సమయంలో ఇటలీలో షూటింగ్ అంటే చాలా రిస్కీ విషయం. అయినా కూడా యూనిట్ సభ్యులు అక్కడ షూటింగ్ చేశారు. ఇటలీ షెడ్యూల్ కోసం భారీ మొత్తంను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇటలీ షెడ్యూల్ అద్బుతంగా వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని కీలక సన్నివేశాలను అక్కడ తీశాం. అందుకోసం ఏకంగా 8 కోట్ల రూపాయలను నిర్మాతలు ఖర్చు చేశారు. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడ సీన్స్ ను చిత్రీకరించినట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. మొత్తంగా ఈ సినిమా కోసం పాతిక కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. కరోనా కారణంగా ఇటలీ షెడ్యూల్ మరీ కాస్ట్లీ అయ్యిందని దర్శకుడు రమేష్ వర్మ అన్నాడు.
250258 865811Hello there, I discovered your weblog by way of Google at exactly the same time as seeking for a comparable topic, your web site got here up, it seems to be great. Ive bookmarked it in my google bookmarks. 933641