తెలంగాణలో లాక్ డౌన్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత కేసులు సంఖ్య పెరుగుతున్నా, పర్సెంటేజ్ మాత్రం తక్కువగా ఉండటంతో లాక్ డౌన్ వ్యవస్థ సక్సెస్ అవుతున్నట్టు అనుకోవాలి. దీనిని ఏప్రిల్ 14 వరకు కఠినంగా అమలు చేస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయని అనుకోవాలి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 70 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లో 11 మందికి నెగెటివ్ వచ్చినట్టుగా ఈరోజు కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు లేకపోవడంతో, విదేశాల నుంచి మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిపైనే ఇప్పుడు పూర్తి నిఘా ఉన్నది. వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. టెస్టులు చేస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వైరస్ సోకుతున్నది. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నది కాబట్టి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు బయటకు వెళ్లేందుకు అనుమతులు లేరు. వారంతా ఇప్పుడు హోమ్ క్వారెంటైన్ ఉన్నారు. ఏప్రిల్ 7 వ తేదీతో హోమ్ క్వారెంటైన్ ముగుస్తుంది. కాబట్టి, ఏప్రిల్ 7 వరకు జాగ్రత్తగా ఉండాలసిన అవసరం ఉన్నది. ఆ సమయం వరకు కొత్తగా వచ్చే కేసుల సంఖ్య తగ్గించుకోగలిగితే లాక్ డౌన్ చాలా వరకు సక్సెస్ అయినట్టే అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకోసమే కఠినమైన నిబంధనలు విధించినట్టు కేసీఆర్ తెలిపారు.
వలస కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్టుగా కేసీఆర్ తెలిపారు. వారందరికి ఉండేందుకు వసతి కల్పించడంతో పాటుగా ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇవ్వడంతో పాటుగా, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున డబ్బులు అందజేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు కేసీఆర్ తెలిపారు.
737988 823475You created some decent factors there. I looked on the internet for the dilemma and located most individuals will go along with along with your web site. 108991
309536 555519Thank you for your fantastic post! It has long been very useful. I hope that you will proceed sharing your wisdom with us. 709477