బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బెంగళూరు వెళ్లారు. లోకేశ్ పాదయాత్రలో ఆయన ఛాతీ నొప్పికి గురైన సంగతి తెలిసిందే. అక్కడ వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. తారకరత్నకు అందుతున్న వైద్యంపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘తారకరత్నకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పోరాడుతున్నారు. తారకరత్నకు తాతగారి ఆశీర్వాదం, ఆత్మబలం, అభిమానుల ప్రార్ధనలు ఆయనకు ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నా వైద్యానికి సహకరిస్తున్నారు. ఐసీయూలో పలకరించేందుకు వెళ్తే కొంత స్పందన కనిపించింది. నిన్నటితో పోలిస్తే కొంత నయం అని వైద్యులు చెప్పడం ఊరటనిస్తోంది’.
‘త్వరలోనే ఆయన కోలుకుని మన మధ్యకు వస్తారని ఆశిస్తున్నాను. కర్ణాటక ప్రభుత్వం నుంచి వైద్య శాఖ మంత్రి సుధాకర్ ఎంతో సహకరిస్తున్నారు. అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని కోరుతున్నాను. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు’ అని అన్నారు.
coming soon Taraka ratna will definetly came out form the hospita with Smily face