షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ ఈ ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పఠాన్ తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డంకి చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తోన్న షారుఖ్, వచ్చే ఏడాది మరోసారి అట్లీతో కలిసి పనిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
షారుఖ్ కోసమే అట్లీ ప్రస్తుతం ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్టింగ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో దళపతి విజయ్ కీలక పాత్రను పోషించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఇంకా ప్రీప్రొడక్షన్ పనులు మొదలవ్వడానికి సమయం ఉంది కాబట్టి షారుఖ్ తన ముందు చిత్రాలు పూర్తి చేసుకోవచ్చు. 2025లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
షారుఖ్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది.