కొన్ని సర్వేలు తప్పుడు నివేదికల్ని ప్రచారంలోకి తీసుకురావొచ్చు.. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అస్సలేమాత్రం ప్రభావం చూపలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేయొచ్చు. కానీ, 2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. ‘ఏవి పాలు, ఏవి నీళ్ళు..’, ‘ఏది చెడు, ఏది మంచి’ అన్న విషయాలపై రాష్ట్ర ప్రజానీకానికి ఓ అవగాహన వచ్చింది.
వైసీపీ – టీడీపీ మధ్య ఆధిపత్య పోరు తప్ప, రెండు పార్టీలకీ రాష్ట్ర అభివృద్ధిపై అస్సలేమాత్రం అవగాహన, విజ్ఞత, బాధ్యత లేవని తేలిపోయింది. ‘మేం ఎన్నికల్లో ప్రజల్ని ప్రలోభపెట్టబోం.. ఎన్ని సీట్లు వస్తాయి.? గెలుస్తామా.? ఓడతామా.? అన్నదే ప్రశ్నే కాదు. మేం, ఎంతమందిని ప్రబావితం చేయగలిగామన్నదే మాకు ముఖ్యం..’ అని చెప్పిన జనసేన మాటల్లో అసలు వాస్తవమేంటో, ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.
బాధ్యతగల రాజకీయ పార్టీగా జనసేన పార్టీ, గడచిన ఏడాది కాలంలో చాలా విషయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.. ప్రజల తరఫున పోరాడుతోంది. ‘ఫక్తు రాజకీయాలకు’ దూరంగా జనసేన రాజకీయాలు నడుస్తుండడంతో, బహుశా రాజకీయ విశ్లేషకులకు కూడా జనసేన అనేది ఓ రాజకీయ పార్టీగా కనిపించి వుండకపోవచ్చు.
‘తెలుగు బులెటిన్ డాట్ కాం’ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. జనసేన పార్టీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా నడిపిస్తున్నారు.? ఎలా బలోపేతం చేస్తున్నారు.? తదుపరి ఎన్నికల్లో జనసేన పాట్ర ఏంటి.? అన్న దిశగా ఓ ఒపీనియన్ పోల్ని ప్రారంభించింది. ‘పవన్ కళ్యాణ్, జనసేన పార్టీని బలోపేతం చేసి తదుపరి ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించే దిశగా నడుస్తున్నారని మీరు భావిస్తున్నారా.?’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానం 74 శాతం మంది నుంచి వచ్చింది. ‘కాదు’ అన్నవారు 26 శాతం మంది.
అయితే, జనసేన పార్టీ, జనంలోకి వెళ్ళేందుకు ఇంకా చాలా కష్టపడాల్సి వుందన్నది నిర్వివాదాంశం. బీజేపీతో జనసేన మైత్రి విషయంలో కొంత గందరగోళం గ్రౌండ్ లెవల్లో కనిపిస్తోంది. చాలా అంశాల్లో బీజేపీ, జనసేన పార్టీతో కలిసి నడవడంలేదు. కీలకమైన విషయాల్లో జనసేన వాయిస్తో బీజేపీ గొంతు కలపలేకపోతోంది. ఆ కారణంగా బీజేపీ పట్ల వున్న నెగెటివిటీ, జనసేన వైపుకూ మళ్ళుతోంది.
ఇంకోపక్క, టీడీపీ – జనసేన కుమ్మక్కు.. అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ‘జనసేన పార్టీ మాకు మిత్రపక్షం లాంటిదే..’ అంటూ టీడీపీ నేతలు కొందరు గ్రౌండ్ లెవల్లో చేస్తున్న దుష్ప్రచారాల పట్ల జనసేన పార్టీ అప్రమత్తంగా వుండాల్సిందే. అన్నిటికీ మించి, వివిధ అంశాలపై జనసేన తరఫున బలమైన గొంతుకల అవసరం ఎంతైనా వుంది.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుందని లైట్ తీసుకుంటే కుదరదు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఏ క్షణాన ఎలాగైనా మారిపోవచ్చు. మరి, జనసేనాని ఆ దిశగా మరింత వేగం పెంచుతారా.? రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోన్న ‘పొలిటికల్ వాక్యూం’ జనసేన పార్టీ భర్తీ చేస్తుందా.? వేచి చూడాలి.
👉#PawanKalyan, @JanaSenaParty ని బలోపేతం చేసి తదుపరి ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించే దిశగా నడుస్తున్నాడని మీరు భావిస్తున్నారా..?
(నోట్: మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయగలరు)#PSPK #PowerstarPawanKalyan @PawanKalyan #Janasena #JanasenaKavathu #Janasenani
— TeluguBulletin.com (@TeluguBulletin) October 15, 2020