Switch to English

వైఎస్‌ జగన్‌ ‘ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌’ – గడ్కరీ ‘న్యూ క్యాపిటల్‌’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, వర్చువల్‌గా విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు రోడ్డు ప్రాజెక్టులపై గడ్కరీకి విన్నవించుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. పనిలో పనిగా, ‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌’ అనే అంశాన్ని వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు.

అయితే, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాత్రం ‘న్యూ క్యాపిటల్‌ అమరావతి’ అనే ప్రస్తావనని ఒక్కసారి కాదు, పలుమార్లు తీసుకొచ్చారు. ఇదిప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్రం, మూడు రాష్ట్రాల అంశంపై పెద్దగా ఆసక్తితో లేదనే విషయం తేటతెల్లమయిపోయిందన్నది ‘వన్‌ క్యాపిటల్‌ అమరావతి’ అని నినదిస్తోన్నవారి విశ్లేషణ.. గడ్కరీ మాటలపై. మరోపక్క, ‘గడ్కరీ వ్యాఖ్యల్ని మరీ అంత బూతద్దంలో చూడాల్సిన పనిలేదు.. దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ విషయంలోనే ఆయన అలా అన్నారు.. అంతకు మించి ఆయన మాటల్లో మూడు రాజధానుల పట్ల వ్యతిరేకత లేదు.

అయితే, వైఎస్‌ జగన్‌ ప్రస్తావించిన ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విషయమై గవర్నర్‌ కూడా సానుకూలంగా స్పందించి వుండాల్సింది..’ అని వైసీపీ మద్దతుదారులు చెబుతున్నారు. ఇదిలా వుంటే, విజయవాడకు సంబంధించి పలు ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టుల తాలూకు క్రెడిట్‌ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, విజయవాడ ఎంపీ కేశినేని నానికి కట్టబెట్టేశారు. కేశినేని నాని అనే పేరు ప్రస్తావించకపోయినా, విజయవాడ ఎంపీ అంటే ఆయనే కదా. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించారు నితిన్‌ గడ్కరీ.

మిగతా విషయాల్ని పక్కన పెడితే.. ఐదేళ్ళపాటు ముక్కీ మూలిగీ అన్నట్లుగా సాగిన దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ పనులు ఎట్టకేలకు పూర్తయి, ఈ ఫ్లై ఓవర్‌ వాహనదారులకు అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. విజయవాడకు సంబంధించి పలు కీలక ప్రాజెక్టులు ఇంకా వేగం పుంజుకోవాల్సి వుంది. ‘శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుంది’ అని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతున్న దరిమిలా, అమరావతి పేరుని ఒకటికి పలుమార్లు వైఎస్‌ జగన్‌ కూడా ప్రస్తావించి వుంటే, ముఖ్యమంత్రిగా ఆయన గౌరవం మరింత పెరిగేదే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...