రాజకీయ నేతలు పార్టీలు మారడం చాలా కామన్. ఎన్నికల సమయంలో జంప్ జిలానీలు చాలామంది కనిపిస్తుంటారు. తమకు అనువుగా ఉండే పార్టీలోకి మారిపోతూ ఉంటారు. అలాంటివారిని బుజ్జగించడానికి ఆయా పార్టీలు పాట్లు కూడా పడుతుంటాయి. అయితే, పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నవారిని ఆపడం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తుంటుంది. తాజాగా జనసేన అదే సూత్రాన్ని ఫాలో అవుతోంది.
ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు నేతలు వరుసగా జారిపోతున్నారు. అటు బీజేపీలోకో, ఇటు వైఎస్సార్ సీపీలోకో వెళ్లిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే అనకాపల్లి నుంచి పోటీ చేసిన చింతా పార్థసారథి, రాజమండ్రి నుంచి బరిలో నిలిచిన ఆకుల సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. పైగా ఆయన జనసేనకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు.
ఇలా ఒకరి తర్వాత మరొకరు కాస్త పేరున్న నేతలతోపాటు జూనియర్ నేతలు కూడా జనసేనను వీడి వెళ్లడం జనసైనికుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే, పార్టీలో ఇలాంటి కీలక పరిణామాలు సంభవిస్తున్నా జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం చలించడంలేదు. పార్టీ వీడి వెళ్లేవారిని ఆపడం గానీ, వారితో మాట్లాడటం గానీ చేయడంలేదు. పెద్ద పెద్ద పార్టీలు సైతం ఇలాంటి సందర్భాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. పార్టీ వీడి వెళ్లేవారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తాయి.
కానీ జనసేనలో మాత్రం అలాంటి ఒరవడి ఏమీ లేదు. ఇలాంటి వ్యవహారాలు పవన్ దృక్పథానికి పూర్తి విరుద్దమని చెబుతున్నారు. ‘‘మనం రమ్మని అడిగితే వారు రాలేదు.. వెళ్లిపోమని మనం చెప్పలేదు. వారంతట వారే నిర్ణయం తీసుకుని వెళ్లిపోతున్నారు. అలాంటివారిని బతిమాలినా ప్రయోజనం ఉండదు. వెళ్లేవారిని వెళ్లనివ్వడమే ఉత్తమం’’ అనేది పవన్ వైఖరి అని పేర్కొంటున్నారు. మరి ఇలా నేతలంతా వెళ్లిపోతే పార్టీ పరిస్థితి ఏమిటని జనసేన నేతల వద్ద ప్రస్తావించగా.. పవన్ కు ఈ విషయంలో వ్యూహం ఉందని, పార్టీ కోసం నిజంగా కష్టపడేవారినే ప్రోత్సహించాలన్నది ఆయన నిర్ణయమని చెబుతున్నారు.
502898 55723I want searching at and I believe this site got some actually useful stuff on it! . 936743
119605 376859Wahhhh,!! I dnt feel its food thats generating her tummy groww!!|tiitaBoo| 229921