అందాల భామ శ్రీదేవి కోరికను నెరవేర్చే పనుల్లో బిజీగా ఉన్నాడు ఆమె భర్త బోనీ కపూర్. శ్రీదేవి ఆకస్మిక మరణం అటు ఆమె కుటుంబ సభ్యులకే కాదు పరిశ్రమకు తీరని లోటు. శ్రీ దేవి మరణం తరువాత ఆమె కూతురు జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేసారు. ధఢక్ సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న జాహ్నవి వరుస సినిమాలతో బిజిగా ఉంది. తాజాగా శ్రీదేవి కోరికతో భాగంగా తన సొంత బ్యానర్ లో తన కూతురు తో సినిమా మొదలెట్టాడు బోణి కపూర్.
బాంబే గర్ల్ పేరుతొ తెరెకెక్కే సినిమాను ప్రకటించాడు. సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా సందర్బంగా ఓ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సందర్బంగా బోనీ కపూర్ మాట్లాడుతూ నా భార్య అడిగినట్లుగా నా కూతురుతో సినిమా నిర్మిస్తున్నాను. ఆమె కోరిక నెరవేరుస్తున్నాను అందుకు చాలా సంతోషంగా ఉంది.. జాన్వీ విజయాన్ని శ్రీదేవి ఎక్కడున్నా ఆనందిస్తుందని మా బిడ్డను ఆశీర్వదిస్తుందని బోణి కపూర్ పేర్కొన్నాడు.
ఇప్పటికే శ్రీదేవి కోరికగా తమిళ స్టార్ హీరో అజిత్ తో ఓ సినిమాను నిర్మించాడు. నెర్కొండ పర్వాయ్ పేరుతొ సినిమా వచ్చింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కోరికగా తన సొంత బ్యానర్ లో కూతురుతో సినిమా చేస్తున్నాడు బోణి కపూర్.
925058 492236It shows how you comprehend this topic. Added this page, is for much more. 928430
636367 10942Hello! Fantastic post! Please when I could see a follow up! 190705