కరోనా సమాజాన్ని కబళించేందుకు ముంచుకొస్తున్న వేళ.. జనసేన పార్టీ శ్రేణులు గ్రౌండ్ లెవల్లో చాలా బాగా వర్క్ చేస్తున్నాయి.. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకూ.. జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ తమకు తోచినమేర అవసరమైనవారికి సహాయం చేస్తున్నారు. బాధితుల వెతల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడమే కాదు, తమకు చేతనైన స్థాయిలో భోజన వసతి కల్పించడంతోపాటు, ఆర్థిక సహాయం అందించడం, జీవనం సజావుగా సాగడానికి పేద ప్రజలకు బియ్యం తదితర నిత్యావసర వస్తువుల్ని అందించడం చూస్తున్నాం. అధికార వైఎస్సార్సీపీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, జనసేన పార్టీ మాత్రం చిత్తశుద్ధితో బాధిత ప్రజానీకాన్ని ఆదుకుంటోందన్నది నిర్వివాదాంశం.
ఇక, రాజకీయ విమర్శల విషయంలో ‘సంయమనం’ పాటిస్తున్నామని పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నా, అధికార పక్షం మాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే వుంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన రాజకీయ సంయమనాన్ని అభినందించాల్సిందే. అయితే, ఇప్పుడున్న రాజకీయాల్లో ఆ సంయమనం కూడా చేతకానితనంగానే మారిపోతోందన్నది గ్రౌండ్ లెవల్లో జనసైనికుల ఆవేదన.
కరోనా వైరస్కి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ కొనుగోలు వ్యవహారంపై పెను దుమారం రేగుతున్న విషయం విదితమే. జనసేన పార్టీకి చెందిన ఆయా విభాగాలు ఈ అంశంపై ముందే ఫోకస్ పెట్టి వుండాల్సింది. ఆ కిట్స్ కొనుగోలు వ్యవహారంలో అధికార పార్టీని దోషిగా చూపడంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సఫలమయ్యింది. ఇలాంటి విషయాల్లో జనసేన యాక్టివ్ అవకపోతే ఎలా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు పనిచేయనప్పుడు, ప్రజలు విపక్షాలవైపు చూస్తారు.. తమ తరఫున పోరాడే నాయకత్వం గురించి ఆలోచిస్తారు. స్థానిక ఎన్నికల్లో జనం మైండ్సెట్లో బలమైన విపక్షంగా, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలి అనుకుంటుంది. అలా ఎదగాలంటే, జనసేన పోరాటం మరింత ఉధృతం కావాలి.. ఆ పోరాటం ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకునేలా వుండాలి. పార్టీ తరఫున కార్యకలాపాలు నడవడమొక్కటే సరిపోదు. వాటిని ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో కలిసొచ్చే మీడియా సంస్థల్నీ కలుపుకుపోవాలి. టీడీపీ చేసేది అదే.
కీలకమైన సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పట్టేందుకు తన అనుకూల మీడియాని వాడుకుంటుంది. సోషల్ మీడియా, వెబ్సైట్లను టీడీపీ వాడుకున్నంత సమర్థవంతంగా ఇంకే పార్టీ వాడుకోవడంలేదన్నది నిర్వివాదాంశం. ఈ దిశగా జనసేన సరికొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఏదిఏమైనా, ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేసే క్రమంలో జనసేన – బీజేపీ ఆటలో అరటిపండులా మారిపోయే పరిస్థితి రాకూడదు. జనసేన – బీజేపీ బలం పెరుగుతుండడాన్ని చూసి, బీజేపీపై విరుచుకుపడుతున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడే బీజేపీ – జనసేన ఇంకా సమర్థవంతంగా అధికార పక్షంపై ‘ఎటాక్’ చేయాల్సి వుంటుంది. లేకపోతే, టీడీపీకి గ్రౌండ్ వదిలేసి, బీజేపీ – జనసేన గ్యాలరీలకే పరిమితవ్వాల్సి వస్తుందేమో.!
99516 623658You completed several excellent points there. I did specific searches on the concern and found many people go in conjunction with along with your blog. 833659
19121 362671I also recommend HubPages itself, and Squidoo, which is comparable. 906406
991835 658208Thank you for sharing with us, I conceive this website really stands out : D. 335591
659391 441702I really enjoy the theme on your web site, I run a internet website , and i would adore to use this theme. Is it a totally free style, or is it custom? 894971