Switch to English

ఆ ‘సంయమనం’ జనసేన ‘కొంప’ ముంచుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కరోనా సమాజాన్ని కబళించేందుకు ముంచుకొస్తున్న వేళ.. జనసేన పార్టీ శ్రేణులు గ్రౌండ్‌ లెవల్‌లో చాలా బాగా వర్క్‌ చేస్తున్నాయి.. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకూ.. జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ తమకు తోచినమేర అవసరమైనవారికి సహాయం చేస్తున్నారు. బాధితుల వెతల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడమే కాదు, తమకు చేతనైన స్థాయిలో భోజన వసతి కల్పించడంతోపాటు, ఆర్థిక సహాయం అందించడం, జీవనం సజావుగా సాగడానికి పేద ప్రజలకు బియ్యం తదితర నిత్యావసర వస్తువుల్ని అందించడం చూస్తున్నాం. అధికార వైఎస్సార్సీపీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, జనసేన పార్టీ మాత్రం చిత్తశుద్ధితో బాధిత ప్రజానీకాన్ని ఆదుకుంటోందన్నది నిర్వివాదాంశం.

ఇక, రాజకీయ విమర్శల విషయంలో ‘సంయమనం’ పాటిస్తున్నామని పదే పదే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నా, అధికార పక్షం మాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే వుంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన రాజకీయ సంయమనాన్ని అభినందించాల్సిందే. అయితే, ఇప్పుడున్న రాజకీయాల్లో ఆ సంయమనం కూడా చేతకానితనంగానే మారిపోతోందన్నది గ్రౌండ్‌ లెవల్‌లో జనసైనికుల ఆవేదన.

కరోనా వైరస్‌కి సంబంధించిన టెస్టింగ్‌ కిట్స్‌ కొనుగోలు వ్యవహారంపై పెను దుమారం రేగుతున్న విషయం విదితమే. జనసేన పార్టీకి చెందిన ఆయా విభాగాలు ఈ అంశంపై ముందే ఫోకస్‌ పెట్టి వుండాల్సింది. ఆ కిట్స్‌ కొనుగోలు వ్యవహారంలో అధికార పార్టీని దోషిగా చూపడంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సఫలమయ్యింది. ఇలాంటి విషయాల్లో జనసేన యాక్టివ్‌ అవకపోతే ఎలా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు పనిచేయనప్పుడు, ప్రజలు విపక్షాలవైపు చూస్తారు.. తమ తరఫున పోరాడే నాయకత్వం గురించి ఆలోచిస్తారు. స్థానిక ఎన్నికల్లో జనం మైండ్‌సెట్‌లో బలమైన విపక్షంగా, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలి అనుకుంటుంది. అలా ఎదగాలంటే, జనసేన పోరాటం మరింత ఉధృతం కావాలి.. ఆ పోరాటం ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకునేలా వుండాలి. పార్టీ తరఫున కార్యకలాపాలు నడవడమొక్కటే సరిపోదు. వాటిని ప్రొజెక్ట్‌ చేసుకునే క్రమంలో కలిసొచ్చే మీడియా సంస్థల్నీ కలుపుకుపోవాలి. టీడీపీ చేసేది అదే.

కీలకమైన సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పట్టేందుకు తన అనుకూల మీడియాని వాడుకుంటుంది. సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లను టీడీపీ వాడుకున్నంత సమర్థవంతంగా ఇంకే పార్టీ వాడుకోవడంలేదన్నది నిర్వివాదాంశం. ఈ దిశగా జనసేన సరికొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఏదిఏమైనా, ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేసే క్రమంలో జనసేన – బీజేపీ ఆటలో అరటిపండులా మారిపోయే పరిస్థితి రాకూడదు. జనసేన – బీజేపీ బలం పెరుగుతుండడాన్ని చూసి, బీజేపీపై విరుచుకుపడుతున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడే బీజేపీ – జనసేన ఇంకా సమర్థవంతంగా అధికార పక్షంపై ‘ఎటాక్‌’ చేయాల్సి వుంటుంది. లేకపోతే, టీడీపీకి గ్రౌండ్‌ వదిలేసి, బీజేపీ – జనసేన గ్యాలరీలకే పరిమితవ్వాల్సి వస్తుందేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...