Switch to English

వైఎస్సార్‌ కంటి వెలుగు: ప్రజల కోసమా? పబ్లిసిటీ కోసమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మరో ‘పబ్లిసిటీ స్టంట్‌’కి తెరలేపింది. వైఎస్సార్‌ కంటి వెలుగు పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో వున్న ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలున్నవారికి వైద్య చికిత్స అందించడం ఈ పథకం తాలూకు ఉద్దేశ్యం.

నివారించగల కంటి సమస్యల్ని దాదాపుగా తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఏ పథకం అమల్లోకి తీసుకొచ్చినా దాన్ని అభినందించి తీరాల్సిందే. కానీ, అది పబ్లిసిటీ స్టంట్‌ కోసమే అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించి తీరాల్సిందే.

తెలంగాణలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే తరహా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ఆ పథకం వల్ల ఎంతమంది లబ్ది పొందారు.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పథకం అమల్లోకి రాకముందే, ప్రకటనలు గుప్పించేసి.. కేసీఆర్‌ సర్కార్‌ చాలా విమర్శల్ని ఎదుర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అదే తప్పిదానికి పాల్పడుతోంది. అప్పుడే పథకం అమల్లోకి వచ్చినట్లు ప్రకటనలు కన్పిస్తున్నాయి. వివిధ దశల్లో కంటి పరీక్షలు నిర్వహించాల్సి వుంది. దానికి చాలా సమయం పడుతుంది కూడా. నిజానికి నవరత్నాల్లో 80 శాతం అమలు చేసేశామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటున్నా.. అందులో అమల్లోకి వచ్చినవాటి శాతమెంత.? అని లెక్క తీస్తే.. ప్రభుత్వం చెప్పే లెక్కలతో పొంతనే వుండదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పరిమితులు బాగా పెంచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళి కంటి పరీక్షలు చేయించుకునేలా కార్యాచరణ రూపొందిస్తే.. అదనపు ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి. అది మానేసి.. ప్రతి ఇంటికీ వెళ్ళి కంటి పరీక్షలు చేయించడమంటే.. గ్రామ వాలంటీర్లను సమర్థవంతంగా వాడుకోవడం.. పార్టీకి పేరొచ్చేలా పబ్లిసిటీ చేసుకోవడం తప్ప.. దీని వల్ల ప్రజలకు ఒరిగేది పెద్దగా వుండదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.

ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో చంద్రబాబుకి సాటి ఇంకెవరూ వుండరు. బహుశా చంద్రబాబు రికార్డుల్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ జగన్‌ తహతహలాడుతున్నారేమో.! అదే గనుక నిజమైతే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి వచ్చిన ఫలితాలతో కూడా వైఎస్‌ జగన్‌ పార్టీ పోటీ పడాల్సి వస్తుంది 2024 ఎన్నికల నాటికి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....