ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారతీయులెవరూ లేరని కేంద్రం స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారత్ నిమగ్నమైంది. నిన్న ఒక్కరోజే 1377 మంది భారతీయులను భారత్ కు తరలించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమంలో భాగంగా గడచిన 24 గంటల్లో 6 విమానాలు భారత్ కు బయలుదేరాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం భారత వైమానిక దళానికి చెందిన విమానాలను సిద్ధం చేసింది. ఈరోజు తెల్లవారుఝామున నేవీకి చెందిన సీ-17 విమానం ఢిల్లీ నుంచి రొమేనియాకు బయలుదేరింది. ఉక్రెయిన్ కు సహాయం అందించేందుకు అవసరమైన సామాగ్రిని ఈ విమానం ద్వారా భారత్ పంపించింది. ఇదే ఇదే విమానంలో భారత పౌరులను తీసుకురానున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అతిపెద్ద విమానాలైన సీ-17 దాదాపు 300 మందిని తరలిస్తాయి. ఈమేరకు కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది.
205903 198998you use a wonderful weblog here! do you need to make some invite posts on my blog? 979310
190302 954960U never get what u expect u only get what u inspect 478917
523890 62199A person necessarily lend a hand to make severely posts Id state. This really is the quite first time I frequented your web page and to this point? I surprised with the analysis you made to make this particular submit extraordinary. Magnificent procedure! 586271