కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి డీజీపీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని వ్యాఖ్యానించింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు 70 శాతం చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. మద్యం షాపులు, పబ్, ధియేటర్లలో రద్దీపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించింది.
కరోనా నిబంధనలు ఉల్లంఘనలపై 22వేల కేసులు నమోదు చసామని డీజీపీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.16 మందికే జరిమానా విధించడంపై వ్యాఖ్యానిస్తూ.. పాతబస్తీలో రెండు రోజులు తనిఖీలు చేస్తే లక్ష మంది దొరుకుతారని పేర్కొంది. సీరో సర్వైలెన్స్ పరీక్షలు వారంలోగా పూర్తి చేస్తామని తెలుపగా.. ఆ వెంటనే నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ లేకపోయినా కంటైన్మెంట్ జోన్లు ఖచ్చితంగా ఉండాలని సూచించింది. ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ వివరాలతో సహా 14లోను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
872296 542479This web internet site is typically a walk-through its the data you wished concerning this and didnt know who ought to. Glimpse here, and youll certainly discover it. 849077