దేశంలో కరోనా కేసులు రోజుకు లక్ష దాటడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్.. వంటి రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ నడుస్తోంది. ఈనేపథ్యంలో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతూండటంతో లాక్ డౌన్ విధిస్తారనే వదంతులతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. గతేడాది ఎటువంటి ముందస్తు ప్రకటనా లేకుండా లాక్ డౌన్ విధించడంతో వలస కూలీలు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. పనులు లేక వందల కిలోమీటర్లు కుటుంబాలతో సహా కాలినడకన ఊళ్లకు వెళ్లాల్సి వచ్చింది.
దీంతో ఇప్పుడు పరిస్థితిలు మళ్లీ కలవరపెడుతూండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ముంబై రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ల కోసం ప్లాట్ ఫాంలు వలస కూలీలతో నిండిపోతున్నాయి. పనులు, తిండి లేక ఇక్కడ ఇరుక్కుపోయే కంటే ముందుగానే వెళ్లిపోవడం మంచిదని బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులు అంటున్నారు. మరోపక్క దేశంలో పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు కూడా వలస కూలీల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో అత్యవసరంగా సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
969864 65015You should participate in a contest for among the best blogs on the web. I will suggest this web web site! 573404